ఈనాటి ముఖ్యాంశాలు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పులుల సంఖ్య పెరగడం సంతోషంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీలో పులుల సంఖ్య 48కి చేరిందని, పులుల సంరక్షణ చర్యలు పెంచుతామని తెలిపారు. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాలిఫోర్నియాలో ఓ ఫుడ్ ఫెస్టివల్ సాగుతుండగా అక్కడ గుమికూడిన వారిపై విరుచుకుపడిన ఆగంతకుడు విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. దుండగుడి కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలి ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్పై కేసు నమోదైంది. మరో పదిమంది పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. హత్య, హత్యాయత్నం, కుట్ర తదితర సెక్షన్ల కింద ఎమ్మెల్యేతోపాటు మరో పదిమందిపై కేసు నమోదు చేశామని పోలీసు అధికారి తెలిపారు.
మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..