నేటి ప్రధాన వార్తలు

Today News Roundup 18th May - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బడికి వెళ్లాల్సిన వయసులో తల్లితో కూలి పనులకు వెళ్తున్న పాపను చూసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చలించిపోయారు. పాపను పాఠశాలలో చేర్పించాలని ఆ తల్లికి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలంలోని మారంపల్లిలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

కూలికి కాదు.. పాపను స్కూల్ కు పంపమ్మా
సాక్షి, గోపాలపురం : బడికి వెళ్లాల్సిన వయసులో తల్లితో కూలి పనులకు వెళ్తున్న పాపను చూసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చలించిపోయారు. 

‘దమ్ముంటే విచారణ ఎదుర్కోండి’
సాక్షి, హైదరాబాద్‌ : తనది అవినీతి పాలన కాదంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. 

విఖ్యాత రచయిత పెద్దిభొట్ల కన్నుమూత
సాక్షి, విజయవాడ :  విఖ్యాత కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పెద్దిభొట్ల సుబ్బరామయ్య(79) కన్నుమూశారు.

జాతీయ పార్టీలపై నమ్మకం లేదనే..
సాక్షి, నిజామాబాద్‌ : కర్టాటక ప్రజలు ఇచ్చిన తీర్పు మాత్రం జాతీయ పార్టీలపై విశ్వాసం లేదనే అర్థం అవుతుందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి : భట్టి
సాక్షి, హైదరాబాద్‌ : కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి మల్లు విక్రమార్క మండిపడ్డారు.

రేపు బలాన్ని నిరూపించుకోండి : సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శనివారం బల నిరూపణ చేసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఎమ్మెల్యేల తరలింపు.. పె...ద్ద హైడ్రామా
సాక్షి, బెంగళూరు/హైదరాబాద్‌: నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌కు చేరుకున్నారు.

ఇనుమును తినేస్తున్న రాయి.. వైరల్‌ వీడియో
మయన్మార్‌ : ప్రపంచంలో కొన్ని ఘటనలు వినడానికి వింతగా ఉంటాయి.

భలే​ ఆఫర్‌ : రూ. 3,399కే 4జీ స్మార్ట్‌ఫోన్లు
న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌, ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌తో చేతులు కలిపింది.

‘శ్రీదేవిని ప్లాన్‌ ప్రకారమే హత్య చేశారు’
సాక్షి, న్యూఢిల్లీ: అతిలోక సుందరి శ్రీదేవి అకాల మరణం చెంది మూడు నెలలు కావస్తున్నా ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.

దారుణంగా అవమానించారు: హరితేజ
సాక్షి, హైదరాబాద్‌ : సినిమా ఆర్టిస్టులను అవమానించడం తగదని, వారిపై ఇష్టమున్నట్లు నోరు పారేసుకుంటున్నారని టాలీవుడ్‌ నటి, బిగ్‌బాస్‌ ఫైనలిస్ట్‌ హరితేజ ఆవేదన వ్యక్తం చేశారు.

సన్‌రైజర్స్‌ బౌలర్‌ చెత్త రికార్డు!
బెంగళూరు: అద్భుత బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో ప్లే ఆఫ్‌ చేరిన సన్‌రైజర్స్‌ గురువారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయింది. 

​క్రికెటర్‌ బిడ్డకు తాజ్‌ మహల్‌ పేరు?
బెంగళూరు : దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌కి భారత్‌లో పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలొయింగ్ ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top