టుడే న్యూస్ రౌండప్
సాక్షి, హైదరాబాద్ : టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో పెట్టుబడుల్లో కూడా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో రూ.20వేల కోట్లను పెట్టుబడులుగా పెట్టిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, మరో రూ.10వేల కోట్లను వచ్చే మూడేళ్లలో పెట్టుబడులుగా పెట్టనున్నట్టు ప్రకటించింది.
‘టీడీపీని బీజేపీలో విలీనం చెయ్యాలి’
కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిన చంద్రబాబు తన తెలుగుదేశం పార్టీని బీజేపీతో విలీనం చెయ్యాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.
కమల్ హాసన్ ఓ గందరగోళం వ్యక్తా!?
సరికొత్త రాజకీయ పార్టీకి శ్రీకారం చుడుతున్న ప్రముఖ దక్షిణాది నటుడు కమల్ హాసన్ బుధవారం రామేశ్వరంలోని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్మారక భవనాన్ని సందిర్శించడం వెనక మతలబు ఏమైనా ఉందా?
కేసీఆర్ కుటుంబంలో విషాదం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కుటుంబంలో విషాదం నెలకొంది.
రాష్ట్రానికి నంబర్ వన్ విలన్ చంద్రబాబే..
రాష్ట్ర ప్రయోజనాలను దగ్గరుండి మరీ నాశనం చేస్తున్న చంద్రబాబు నాయుడేనని నంబర్ వన్ విలన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సముద్ర గర్భంలో డ్రాగన్ వాల్
దక్షిణ చైనా సముద్రంలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నీటిగర్భంలో గ్రేట్ వాల్ను నిర్మిస్తోంది.
లక్ష ఉద్యోగాలిస్తాం : ముఖేష్ అంబానీ
టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో పెట్టుబడుల్లో కూడా దూసుకెళ్తోంది
అప్పడాలు అమ్ముకుంటున్న ఈయన ఎవరో తెలుసా?
నగరాల్లోని బస్టాప్ల్లో, కూడళ్లలో అప్పడాలు, పిండివంటలు అమ్ముకుంటూ చాలామంది కనిపిస్తారు. వారిని చాలామంది పట్టించుకోరు.
అశ్లీల ఫోటోపై కుల్దీప్ ట్వీట్..
తన అధికారిక ఇన్స్టాగ్రాం అకౌంట్ హ్యాకింగ్కు గురయిందని భారత స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ట్వీట్ చేశాడు.