జిల్లాలో నేడు 12వ రోజు పాదయాత్ర

Today 12th Day In Praja Sankalpa Yatra - Sakshi

అచ్యుతాపురం మండలంలో ప్రజాసంకల్పయాత్ర

ఉదయం 7.30 గంటలకు కొండకర్ల జంక్షన్‌ నుంచి ప్రారంభం

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 248వ రోజు మంగళవారం కూడా యలమంచిలి నియోజకవర్గంలో కొనసాగనుందని వైఎస్సార్‌ సీపీ ప్రొగ్రామ్స్‌ కమిటీ కన్వీనర్‌ తలశిల రఘురాం వెల్లడించారు. జిల్లాలోని 12వ రోజు పాదయాత్ర అచ్యుతాపురం మండల పరిధిలోని గ్రామాల మీదుగా సాగనుందన్నారు. అచ్యుతాపురం మండలం కొండకర్ల జంక్షన్‌ నుంచి మంగళవారం ఉదయం 7.30 గంటలకు ప్రారంభం కానున్న పాదయాత్ర హరిపాలెం, పెదపాడు క్రాస్, తిమ్మరాజుపేట మీదుగా సాగుతుందన్నారు. తిమ్మరాజుపేట వద్ద జననేత రాత్రి బసకు ఆగుతారన్నారు. యలమంచిలి నియోజక వర్గంలో ఆరో రోజు సాగనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top