ఈనాటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యతో పాటు క్రీడలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయమని క్రీడల మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. తిరుపతి నగరంలోని వినాయక సాగర్ అభివృద్ధే తమ లక్ష్యమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపై కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చివరి వరకు ధైర్యం కోల్పోకుండా మృత్యువుతో పోరాడి అరుణ్ జైట్లీ పోరాట పటిమను ప్రదర్శించారని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆమె జైట్లీ భార్య సంగీతా జైట్లీకి సంతాప లేఖ రాశారు. మరిన్ని వార్తల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..