అన్నా..మా సమస్య పరిష్కరించు
మేమంతా విశాఖపట్నం జిల్లా ఆర్ట్, వర్క్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ యూనియన్ సభ్యులం. ఎస్ఎస్ఏ కింద 2012 నుంచి ప్ర భుత్వ పాఠశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాం. ఇంతవరకూ మమ్మల్ని రెగ్యులర్ చేయలేదు. చాలీచాలని జీతాలతో ఉద్యోగ భద్రత లేక ఆందోళన చెందుతున్నాం. మహానేత వైఎస్సార్ ఉన్నప్పుడు 2009లో అప్పుడు ఉన్న ఉపాధ్యాయులను రెగ్యులర్ చేశారు. మీరు అధికారం చేపట్టిన వెంటనే మా సమస్యను పరిష్కంచాలని జననేత జగన్మోహన్రెడ్డిని కోరాం.