టీచర్ల అర్ధనగ్న నిరసన
శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం పండిట్, పీఈటీ పోస్టుల ఉన్నతీకరణకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేయడంలో జాప్యం చేయడానికి నిరసనగా రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆదివారం అర్ధనగ్న నిరసన నిర్వహించారు. స్థానిక వైఎస్సార్ కూడలిలోని ము న్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో అర్ధనగ్నంగా కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు పిసిని వసంతరా వు మాట్లాడుతూ గత నెల 6న మంత్రి వర్గ ఆమో దం జరగగా, ఇప్పటివరకు ఉత్తర్వులు విడుదల చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్ని సంఘాల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గుతున్నారని ఆక్షేపించారు. సోమవారం నుంచి విజయవాడలో ఉత్తర్వులు విడుదలకు సంబంధించి రిలే నిరాహా ర దీక్షలు చేపట్టనున్నామన్నారు. కార్యక్రమంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకుడు సూర పాపారావు, పండిత, వ్యాయామ జేఏసీ ప్రతినిధులు నెయ్యిల చంద్రరావు, టేకి బాబూరావు, గొడవ మేరీ ప్రసాద్, బి.హెచ్.ఎల్. వి.శర్మ, సూరిబాబు, కె.శ్రీను, గణపతి, పార్వతీ శం, తవుడు, లక్ష్మిపతి, తులసీదాసు, ఎల్.వి.రమణ, షేక్జాఫర్, రామాంజనేయులు, సత్యం, ఆనందరావు, కాంతారావు, త్రిమూర్తి, కమలాకర్, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.