జగన్‌కు సహిత విద్య ఉపాధ్యాయుల వినతి

Teachers Meet YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

విశాఖపట్నం , పెందుర్తి: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పెందుర్తి మండలం చింతగట్లలో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని సహిత విద్య(భవిత కేంద్రాల నిర్వాహకులు) ఉపాధ్యాయులు గురువారం కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 1,60,000 మంది దివ్యాంగ విద్యార్థులకు తాము విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామన్నారు. తమను రెగ్యులర్‌ చేస్తామని 2015లో ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. కానీ నేటికీ ఆ జీవోకు అతీగతీ లేదని వై.ఎస్‌.జగన్‌ వద్ద వారు వాపోయారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రతిపక్ష నేతకు వినతిపత్రం అందజేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top