భూమి లాగేసుకుంటున్నారు
శ్రీకాకుళం :అన్నా.. మా భూమి ఆక్రమించుకునేందుకు టీడీపీ నాయకులు కుట్ర చేస్తున్నారు’ అని సంతబొమ్మాళికి చెందిన దూబ వేణుగోపాలరావు జగన్తో చెప్పారు. తన తండ్రి మాజీ సైనిక ఉద్యోగి అని, అప్పట్లో ఆయనకు ఇచ్చిన 6 సెంట్ల స్థలాన్ని ఆక్రమించేందుకు టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ పాదయాత్రలో పాల్గొన్నప్పటి నుంచి వేధిస్తున్నారని చెప్పారు. ఉద్యోగం మానుకుని ఆస్తుల కోసం పోరాడుతున్నానని తెలిపారు.
సంబంధిత వార్తలు