వైఎస్సార్‌ సీపీలోకి చేరికలు

TDP Leaders Join in YSRCP Srikakulam - Sakshi

శ్రీకాకుళం , పోలాకి: కవిటి మండలానికి చెందిన వివిధ పార్టీల నాయకులు ప్రజా సంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి సోమవారం చేరారు. కవిటి ఎంపీపీగా పనిచేసి ఇటీవల రాజకీయంగా ఇబ్బందులకు గురైన బెందాళం కిరణకుమారి, బి.గొనపపుట్టుగకు చెందిన టీడీపీ నాయకుడు ముకుందపట్నాయక్‌ తదితరులు నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వీరికి జగన్‌ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు పిరియా కృష్ణారావు, బి.కృష్ణమూర్తి సైతం పార్టీలో చేరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top