జగన్ సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ నాయకులు
విశాఖపట్నం :పాదయాద్ర నుంచి సాక్షి బృందం : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్ప యాత్రలో భాగంగా కోటవుర ట్ల, పాయకరావు పేటకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. కోటవురట్ల మండలానికి చెందిన 200 మంది టీడీపీ నాయకులు మాజీ ఎమెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్సార్సీపీలో చేరగా వారిని సాదరంగా జగన్మోహన్రెడ్డి ఆహ్వానించారు. వీరిలో గెడ్డమూరి రమణ, మునగాడ చిరంజీవి, మారయ్య, సీహెచ్ కొండలరావు, చెంగల చిన్నబ్బాయి, వి.అప్పారావు, బి.శ్రీను ఉన్నారు.