టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
చిత్తూరు, బైరెడ్డిపల్లె : మండలంలోని వెంగంవారిపల్లెకు చెందిన పలువురు శుక్రవారం టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేగౌడ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో రాజప్ప, వెంకటా చలపతి, దేవన్న, రవి, రెడ్డెప్ప, మణి, జైరాం, ఫయాజ్, రఘుపతి, బాబు, గంగయ్య, సుబ్రమణ్యం, విశ్వనాథ్, గోపాల్, తిరుమలేష్, శీనప్ప, ఆంజి, వెంకటప్ప, ఈశ్వరప్ప, రంజిత్, అబ్బు, ఎం.వెంకటేష్ తదితరులు ఉన్నారు.