టీడీపీ నాయకులు కక్ష సాధిస్తున్నారు..
విశాఖపట్నం :వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదలమైన మాకు కొమ్మాదిలో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద కె–1, 2,3 కాలనీలు నిర్మించి నీడ కల్పించారు. ఆయన చేసిన మేలుకు గుర్తుగా మేము ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలబడాలని నిర్ణయించుకున్నాం. దీంతో స్థానిక టీడీపీ నాయకులు కక్ష సాధిస్తున్నారు. ఏడేళ్లుగా డ్వాక్రాలో సీఆ ర్పీ గా చేస్తున్న వాళ్లను తొలగిస్తున్నారు. మిగతావారిపై ఎస్సీఎస్టీ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. మాకు వైఎస్సార్సీపీ అండగా నిలవాలి. –కొమ్మాది కె–3 కాలనీ బాధితులు