కేసుల ఎత్తివేతపై కోర్టుకెళ్తాం: వాసిరెడ్డి పద్మ
నో కేసు.. సూట్కేసు..
ఇదే సీఎం చంద్రబాబు విధానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ లేదు, ఉద్యోగాల్లేని వారికి నిరుద్యోగ భృతి లేదు గానీ టీడీపీ నేతలపై ఉన్న కేసులు మాత్రం మాఫీ అవుతు న్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. నో కేసు.. సూట్కేసు అనే సూత్రంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. నేరాలు చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోకుండా వారి కేసులు ఎత్తేసేందుకు ఏకంగా 132 జీవోలు విడుదల చేశారంటే రాష్ట్రంలో ఎంతటి దారుణమైన పాలన సాగుతోందో ప్రజలు గమనించాలన్నారు.
సీఎం చంద్రబాబు చట్టాలను, న్యాయ స్థానాలను అవమానించే విధంగా వ్యవహరిస్తున్నా రని దుయ్యబట్టారు. జీవోలు విడుదల చేసి కేసులు మాఫీ చేయడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించి, న్యాయపోరాటం చేస్తామ న్నారు. వాసిరెడ్డి పద్మశుక్రవారం హైదరా బాద్ లోటస్పాండ్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఉంటే ఇష్టం వచ్చినట్లుగా కేసులు బనాయిస్తాం.. మాతో చేతులు కలిపితే నేరాలు చేసినా కేసులు ఎత్తివేస్తాం అనే నియంత ధోరణితో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.