నీరు రాక పంటలు ఎండుతున్నాయి...
మెంటాడ మండలంలోని గుర్లగెడ్డ వద్ద రూ.4.18 కోట్లతో నిర్మించిన గుర్ల గెడ్డ ప్రాజెక్టు నుంచి ఏళ్లు గడుస్తున్నా సాగునీరు రావడం లేదు సార్! మెంటాడ, గజపతినగరం, గంట్యాడ మండలాల్లోని సుమారు మూడు వేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరందించే ఉద్దేశంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో నిర్మించిన కాలువలు కూడా కూలిపోతున్నాయి. ప్రధాన ప్రాజెక్టు వినియోగించకుండానే మరమ్మతులకు గురవుతున్నా అటు అధికారులు, అధికార పార్టీ నాయకులు కూడా పట్టించుకోవడం లేదు. మరో పక్క జలాశయం పరిధిని 200 మీటర్లు పెంచాల్సి ఉంది. దీనిని పునరుద్ధరించడానికి రూ.5కోట్లు అవసరమవుతుందని ఇంజినీరింగ్ అధికారులు చెప్పినా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా రైతుల కష్టాలు గట్టెక్కించాలి.
– పల్లె కన్నమ్మ, సర్పంచ్ గుర్ల, అప్పలనాయుడు ఉప సర్పంచ్, రెడ్డి రాజపు నాయుడు, వైస్సార్ సీపీ నేత, మెంటాడ మండలం