ఆటో డ్రైవర్లపై తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం

TDP Activists Quarrels With Auto Drivers - Sakshi

సాక్షి, చిత్తూరు : అధికార పార్టీ అండచూసుకుని తెలుగు తమ్ముళ్లు మరోసారి రెచ్చిపోయారు. చంద్రగిరిలో‌ ఆటో డ్రైవర్లతో  టీడీపీ నాయకులు దౌర్జన్యంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోడ్డు షో కోసమై 400 ఆటోలను తెలుగు తమ్ముళ్లు ఆదివారం బాడుగకు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన రద్దు కావటంతో ఆటోలకు బాడుగ ఇవ్వమని తెలుగు తమ్ముళ్లు తేల్చిచెప్పారు.

దీంతో ఆటో డ్రైవర్లు తిరగబడ్డారు. అయినా తెలుగు తమ్ముళ్లు బాడుగ ఇవ్వకుండా వారితో దౌర్జన్యంగా వ్యవహరించారు. విషయం తెలిసి మీడియా అక్కడికి చేరుకోవటంతో సర్దుకున్న తెలుగు తమ్ముళ్లు ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇస్తామని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top