టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరిక
కృష్ణా జిల్లా: ఎన్నికలు దగ్గరపడే కొద్దీ వైఎస్సార్సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. మొవ్వ మండలం చినముత్తేవి గ్రామానికి చెందిన సుమారు 150 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి పామర్రు నియోజకవర్గ సమన్వయకర్త కైలే అనిల్ కుమార్ కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
100 మంది చేరిక
విశాఖపట్నం నగరం వేపగుంట ముత్యమాంబ కాలనీకి చెందిన 100 టీడీపీ కార్యకర్తలు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. వీరంతా పెందుర్తి వైఎస్సార్సీపీ సమన్వయకర్త అదీప్ రాజ్, ఆదిరెడ్డి మురళి సమక్షంలో పార్టీలోకి వచ్చారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.