మహాకూటమి పేరుతో మహాఓటమి పాలైంది

Tammineni Sitaram Slams Chandrababu Naidu - Sakshi

పాదయాత్ర బహిరంగ సభలో         తమ్మినేని సీతారాం  

శ్రీకాకుళం ,ఆమదాలవలస : తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి పేరుతో ఎన్నికల బరిలోకి దిగిన టీడీపీ మహా ఓటమి పాలైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు తమ్మినేని సీతా రాం అన్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో భా గంగా ఆమదాలవలస పట్టణంలో మంగళవా రం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మా ట్లాడారు. అబద్ధాలు చెప్పి రెండు రాష్ట్రాల ప్రజ లను మోసం చేసిన చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు ఎన్నికల ఫలితాల్లో సరైన తీర్పు ఇచ్చి తగిన బుద్ధి చెప్పారన్నారు. ఆమదాలవలస ని యోజకవర్గంలో భూకబ్జాలు, ఇసుక దందాలు, మద్యం మాఫియాలకు స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్‌ మారుపేరుగా మారిపోయారని విమర్శించారు. సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో 99 ఎకరాలు ప్రభుత్వ భూమిని స్వాహా చేయడానికి కుట్రలు చేస్తున్నారన్నారు.

పట్టణంలోని పంచాయతీరాజ్‌ కార్యాలయం ఆవరణలో ఉన్న కోట్ల రూపాయలు విలువ చేసే 30 సెంట్లు స్థలాన్ని టీడీపీ కార్యాలయం నిర్మాణం పేరుతో స్వాహా చేయడానికి కుట్ర చేశారని అన్నారు.  నియోజకవర్గానికి ఇరువైపులా అండగా ఉన్న వంశధార, నాగావళి నదులను కొల్లగొట్టి ప్రకృతి ప్రకోపానికే బలయ్యాడని, గుర్తుచేశారు. ప్రç Ü్తుతం పోలీస్‌స్టేషన్, తహసీల్దార్‌ కార్యాలయాలకు ఆర్జీలు పెట్టుకునేందుకు వెళ్తున్న ప్రజలను కూడా పార్టీ గురించి అడిగి పనులు చేస్తున్నారని ఆరోపించారు. ఆమదాలవలస పట్టణంలో మూ తబడిన సుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని గత ఎన్ని కల్లో చెప్పి రైతులు ఓట్లు దోచుకున్న స్థానిక ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి రైతులను నిలువునా మోసం చేశారని గుర్తు చేశారు.  టీడీపీ నాయకుల వేధింపులకు తాళలేక ఆమదాలవలస మం డలం దూసి గ్రామంలో గల కాన్‌కాస్ట్‌ కర్మాగా రం మూతవేసి కార్మికులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బొడ్డేపల్లి రమేష్‌కుమార్, పార్టీ జిల్లా సే వాదళ్‌ అధ్యక్షులు ఎ.ఉమామహేశ్వరరావు, కౌ న్సిలర్‌ దుంపల శ్యామలరావు, బొడ్డేపల్లి అజం తాకుమారి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top