స్పీకర్గా గర్వపడుతున్నా: తమ్మినేని సీతారాం
సాక్షి, అమరావతి : చరిత్రాత్మక, విప్లవాత్మక బిల్లులు ప్రవేశపెట్టి, ఆమోదించిన శాసనసభకు స్పీకర్గా వ్యవహరిస్తున్నందుకు తనకు గర్వంగా ఉందని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. విశాల ప్రయోజనాలతో ముడిపడిన బిల్లులను రూపొందించిన ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. సభలో బిల్లులు, చర్చలను అడ్డుకోవడం ప్రతిపక్ష సభ్యులకు తగదన్నారు. ఇకపై సభా నియమాలకు, సంప్రదాయాలకు ఎవరు విఘాతం కలిగించిన క్షమించే ప్రశ్నే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని తమ్మినేని స్పష్టం చేశారు.