బ్లడ్ క్యాన్సర్తో బాధ పడుతున్నాడు ఆదుకో అన్నా!
తూర్పుగోదావరి : ‘‘నా కొడుకు భయంకరమైన బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు.. ఆదుకో అన్నా’’ అంటూ తాళ్లరేవు మండలం చినబొడ్డువెంకటాయపాలేనికి చెందిన దోమ వీరవేణి జననేత జగన్మోహన్రెడ్డిని కోరింది. ఏడాది వయస్సు ఉన్న తన కుమారుడు ఆకాష్వర్మను వెంటబెట్టుకుని ఏపీ త్రయంలో జరుగుతున్న పాదయాత్రలో జగన్ను కలుసుకుని సమస్యను వివరించింది. నాలుగు నెలల క్రితం బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డాడని, తమిళనాడులో చికిత్స చేయిస్తున్నామని, శస్త్ర చికిత్సకు రూ.17 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెబుతున్నారని కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే తమకు అంత స్థోమత లేదని వాపోయింది. తన బిడ్డను కాపాడాలని విజ్ఞప్తి చేసింది.
సంబంధిత వార్తలు