పాదయాత్ర విశేషాలు చూపిన విద్యార్థినులు

Sudents Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

పశ్చిమగోదావరి : వట్లూరి గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు జగన్‌ పాదయాత్ర విశేషాలకు చెందిన చిత్రాలను సేకరించి బుక్‌లెట్‌గా తయారు చేసి జగన్‌కు అందజేశారు. 2017 నవంబర్‌ 6న ప్రారంభమైన నాటి నుంచి దెందులూరు గ్రామం వరకు జరిగిన పాదయాత్ర విశేషాల పత్రికా క్లిప్పింగ్‌లను భద్రపరిచి తయారుచేసిన బుక్‌లెట్‌తో జగన్‌ను కలిశారు. ఈ బుక్‌లెట్‌ జగన్‌కు చూపించడానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వట్లూరు నుంచి వచ్చినట్టు విద్యార్థినులు ఉదయ దుర్గ, రమాదేవి తెలిపారు. ఈ రోజు తమకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top