స్కాలర్షిప్లు రావడంలేదన్నా..
తూర్పుగోదావరి :‘విద్యార్థులకు స్కాలర్షిప్లు సక్రమంగా రావడం లేదన్నా’ అంటూ పారుపాకకు చెందిన డిగ్రీ విద్యార్థిని పి.రమ్యశ్రీ జగన్కు తెలిపింది. పాదయాత్రలో జగన్ను కలుకుని సమస్య వివరించింది. డిగ్రీ చదువుతున్న తమకు స్కాలర్షిప్లు సక్రమంగా ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థులకు స్కాలర్షిప్లు సక్రమంగా అందించాలని విజ్ఞప్తి చేసింది.