పుణ్యగిరి ఎదుట ఆందోళన
విజయనగరం: విజయనగరం జిల్లా ఎస్ కోటలోని పుణ్యగిరి కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. సోమవారం ఇదే కళాశాల హాస్టల్లో ఉండే 28 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీనిపై విచారణ చేయటానికి వచ్చిన స్థానిక ఆర్ఐఓ బాబాజీరావు ఎటువంటి విషయం చెప్పకుండా వెళ్లిపోవడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేశారు. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.