జగన్ను కలసిన ఆనందం మరువలేనిది
విశాఖపట్నం : ఈమె పేరు జామి యామిని. కె.కోటపాడు మండలం పోతవలస గ్రామం. పుట్టుకతో మూగ. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఆమెకు వికలాంగ పింఛన్ మంజూరైంది. అప్పటి నుంచి వైఎస్సార్ కుటుంబం అంటే ఈమెకు ఎనలేని అభిమానం. ఇంటర్ వరకు చదువుకుంది. టీవీల్లో, పత్రికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించి ఏ కార్యక్రమం వచ్చినా ఆసక్తిగా తిలకిస్తుంది. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తమ గ్రామానికి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని తన తల్లి జామి లక్ష్మితో కలసింది. తన అభిమాన నాయకుడిని నేరుగా కలవడంతో తన కుమార్తె ఎంతో ఆనందం పొందిందని ఆమె తల్లి తెలిపారు.