రీయింబర్స్మెంట్ హామీతో ఊరట
విశాఖపట్నం :ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు పార్టీలు, కులమతాలకు అతీతంగా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తానని ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటన మాకెంతో ఊరటనిచ్చింది. మాలాంటి పేద బ్రాహ్మణ విద్యార్థుల ఉన్నత చదువులకు అవకాశం ఉంటుంది. చదువుకయ్యే ఖర్చంతా తానే భరిస్తానని జగన్ ఇచ్చిన హామీ మాకెంతో భరోసానిచ్చింది.–మేఘన, విద్యార్థి, విశాఖపట్నం