ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య
నంద్యాల: ఇటీవల గుడ్షెప్పర్డ్ పాఠశాల విద్యార్థిని ఉరేసుకొని మృతి చెందిన ఘటన మరువకముందే నంద్యాలలో ఏడో తరగతి చదువుతున్న మరో విద్యార్థి శనివారం ఫ్యాన్కు ఉరేసుకొని మృతి చెందాడు. వివరాలు.. పట్టణంలోని దేవనగర్కు చెందిన నరసింహులు, బాలనాగమ్మల కుమారుడు నరేష్ (11) ఇంట్లో ఎవరూ లేని సమయంలో టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకొని ఫ్యాన్కు చున్నితో ఉరేసుకొని మృతి చెందాడు. నరేష్ పట్టణంలోని మున్సిపల్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు సక్రమంగా వెళ్లకపోవడం పై తల్లిదండ్రులు మందలించడం వల్ల మృతి చెందాడా.. లేక పాఠశాలలో ఉపాధ్యాయుల ఒత్తిడి వల్ల అఘాయిత్యానికి పాల్పడ్డాడా అన్నది తెలియాల్సి ఉంది. త్రీటౌన్ సీఐ దేవేంద్ర కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఇంతవరకు తమకు ఫిర్యాదు చేయలేదని, అయినా కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని తెలిపారు.