వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య
ఖానాపురం, న్యూస్లైన్: తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోకనగరం గ్రామానికి చెందిన సాయిలు, సరోజన దంపతుల చిన్న కుమార్తె శిరీష (17) నర్సంపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ఆమెను వేధిస్తున్నారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన శిరీష సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు రక్షించేలోపే పూర్తిగా కాలిమసైంది. కేసు దర్యాప్తులో ఉంది.