వీఆర్ఎస్ ద్వారా సాగునీరు..
విజయనగరం : వెంగళరాయసాగర్ ద్వారా పార్వతీపురం, బొబ్బిలి నియోజకవర్గాలకు సాగునీరు అందించాలి. అందుకు అవసరమైన పనులు నిర్వహించాలి. దీనివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
– శంబంగి వెంకట చినప్పలనాయుడు,వైఎస్సార్సీపీ బొబ్బొలి నియోజకవర్గ సమన్వయకర్త.
చిన్నచూపు..
ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఉపకార వేతనాలు కూడా అందించడం లేదు. నేను పాలిటెక్నికల్ చదువుతున్నాను. ఏడాదికి నాలుగు వేల రూపాయల ఉపకార వేతనం రావాలి. కాని ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వసతిగృహం ఫీజులు కూడా మేమే చెల్లించుకుంటున్నాం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే మాలాంటి వారికి న్యాయం జరుగుతుంది. – భావన, బొబ్బిలి