మహిళల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి

Special ministry needs For Women - Sakshi

విశాఖపట్నం : నిరుద్యోగ సమస్య పరిష్కారం..మహిళాభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డాక్టర్‌ డి.వెంకట్‌ ప్రజా సంకల్పయాత్రలో జగన్‌కు సూచించారు. కొండకర్ల జంక్షన్‌లో వైఎస్‌ జగన్‌ను కలిసి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పలుసూచనలు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, మూడు మండలాలకో మధ్యతరహా పరిశ్రమ పెట్టాలని కోరారు. సింగిల్‌ విండో ద్వారా పరిశ్రమలకు కావాల్సిన అవసరాలన్ని నిర్ణీత గడువులోగా సమకూరేలా చేయాలి. రేషన్‌ దుకాణాల ద్వారా నాసిరకం బియ్యం స్థానంలో సన్న బియ్యంతో పాటు కందిపప్పు, మినపప్పు, పంచదార, నూనె ఇతర నిత్యావసరాలన్ని సరఫరా చేయాలని కోరారు.– వైఎస్‌ జగన్‌కు సమర్పించినవినతిపత్రంలో డాక్టర్‌ వెంకట్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top