సీఆర్పీల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదు

Solve The CRP Probles In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం:మేమంతా సర్వశిక్ష అభియాన్‌ ద్వారా 2012లో సీఆర్పీలుగా నియామితులయ్యాం. జిల్లాలో 271 మంది సీఆర్పీలుగా పని చేస్తున్నాం. మేమంతా పీజీతో పాటు బీఎడ్, డీఎడ్‌ చేశాం. కానీ మాకు పనికి తగ్గ వేతనాలు చెల్లించడం లేదు. నెలకు కేవలం రూ.17,500లు మాత్రమే చెల్లిస్తున్నారు. టీఏ, డీఏ ఇవ్వకపోవడంతో జీతం డబ్బుతోనే ఫీల్డ్‌కు వెళ్తున్నాం. మాకు ఉద్యోగ భద్రత లేదు. జీవో నెం.27 వర్తింపజేయడం లేదు. సమాన పనికి సమాన వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా సమస్యలను ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మా సమస్యలను పరిష్కారిస్తారని భావిస్తున్నాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top