30 మంది ఉద్యోగాలు తీసేశారు

Smartkem Employees Meet YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

శ్రీకాకుళం అర్బన్‌: ఎచ్చెర్ల మండలం పొన్నాడలోని స్మార్ట్‌కెమ్‌ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్న 30 మంది ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరులమనే కక్షతో తొలగించారని పి.రమణ అనే వ్యక్తి ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా శుక్రవారం కేశవరావుపేట వద్ద ఏర్పాటు చేసిన శిబిరం వద్ద జగన్‌ను కలసి వినతిపత్రం అందించారు. తమను తొలగించడంపై లేబర్‌ కమిషనర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమకు ఉపాధి చూపాలని వేడుకున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top