రాఖీ కట్టడం మరచిపోలేని అనుభూతి..
తూర్పుగోదావరి :జగనన్నకు రాఖీ కట్టడం మరచిపోలేని అనుభూతని ఇండుగుపల్లికి చెందిన గుడివాడ సత్యవతి తెలిపారు. పాదయాత్రలో భాగంగా తాటిపాక వచ్చిన జగన్ను ఆమె కలుసుకుని చేతికి రాఖీ కట్టారు. తనకు అన్నయ్య ఎవరూ లేరని, జగనన్నను తన అన్నయ్యగా భావిస్తూ, ఆయనకు మంచి జరగాలని చేతికి రాఖీ కట్టినట్టు తెలిపారు.