జగనన్న వస్తేనే ఉద్యోగ భద్రత
విశాఖపట్నం : మేం 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిన సెకెండ్ ఏఎన్ఎంలు పని చేస్తున్నాం. మా సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదు. మా చేత వెట్టిచాకిరీ చేయిస్తోంది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా..సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వడం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నెలకు రూ.600లు ఎఫ్టీఏ చెల్లించేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎఫ్టీఏ చెల్లించడం లేదు. వైద్య అరోగ్య శాఖలో రెగ్యులర్ ఏఎన్ఎంలకు ఏడాదికి 35 రోజులు సెలవులు ఇస్తుండగా మాకు మాత్రం కేవలం 12 రోజులే ఇస్తున్నారు. యూనిఫారాం అలవెన్సులు ఇవ్వడం లేదు. ప్రధానంగా మాకు ఉద్యోగ భద్రత కరువైంది. మా సమస్యలను జగనన్న దృష్టికి తీసుకువెళ్లాం. జగనన్న సీఎం అయితేనే మాకు ఉద్యోగ భద్రత దొరుకుతుందని భావిస్తున్నాం.– సెకెండ్ ఏఎన్ఎంలు