చదివే అవకాశమేదీ...
శ్రీకాకుళం :‘అన్నా ఈ ప్రభుత్వం హయాంలో ఆడపిల్లల కు చదువుకునే అవకాశం లేకుండా పోయింది. చెట్టి పొది లం పరిసర గ్రా మాల విద్యార్థులకు రాకపోకలకు రహదారి సదుపాయం లేదు. 20 కిలోమీటర్లు వచ్చి చదువుకోవడానికి బస్సులూ లేవు’ అంటూ జి.సిగడాం మండలం పొదిలాంకు చెందిన బాలి త్రివేణి జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. బస్సులు లేకపోవడంతో ఆడపిల్లలను స్కూల్కు పంపేందుకు తల్లిదండ్రులకు ధైర్యం చాలడం లేదని చెప్పింది. తన తండ్రి కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేసేవారని, టీడీపీ వచ్చాక ఆ ఉద్యోగం తొలగించారని ఫిర్యాదు చేసింది.