సిగరెట్లు తేలేదని హాస్టల్ విద్యార్థులపై దాడి
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి భాస్కరనగర్లోని ఎస్సీ హాస్టల్లో విద్యార్థులపై శనివారం కుక్ పి.సుదర్శన్రాజు, కమాటీ గురవయ్య దాడిచేసి తీవ్రంగా కొట్టారు. విద్యార్థులకేకల్ని గమనించిన స్థానిక కార్పొరేటర్ గుత్తుల మురళీధర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తమతో మోటారు సైకిళ్లు, హాస్టల్లోని బాత్రూమ్లు కడిగిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
దుకాణం నుంచి సిగరెట్లు తేలేదని కోపగించి ఇద్దరూ తమను తీవ్రంగా కొట్టారని చెప్పారు. హాస్టల్ వార్డెన్ వెంకటరాజు సెలవు పెట్టడంతో రమణ అనే మరో వార్డెన్కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఆయన అప్పుడప్పుడు హాస్టల్కు వచ్చి వెళుతున్నారు.ఈ విషయమై జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి కె.రామారావు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి రాజశేఖర్ విచారణ నిర్వహించారు.