కనీస సౌకర్యాలు కరువు..
శ్రీకాకుళం :మా గ్రామంలో ఎస్సీ కాలనీ అభివృద్ధిని టీడీపీ నాయకులు మరిచారు. కనీస మౌలిక సదుపాయాలు లేక 70 కుటుంబాలు దయనీయ పరిస్థితిలో మగ్గిపోతున్నాయి. 1984 నిర్మించుకున్న గృహాలు పూర్తిగా శిథిలమయ్యాయి. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలు వర్తింపజేయడం లేదు. ఒకే ఇంట్లో రెండు నుంచి మూడు కుటుంబాలు నివశిస్తున్నాం. కనీసం సామూహిక మరుగుదొడ్లు కూడా లేక అవస్థలు పడుతున్నాం.– పోలాకి భూలక్ష్మి, రాగోలుపేట, శ్రీకాకుళం.