ఇసుకమాఫియా ఆగడాలు భరించలేకపోతున్నామన్నా
తూర్పుగోదావరి :ఇసుక మాఫియా ఆగడాలు, అరాచకాలు భరించలేకపోతున్నామని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద కోటనందూరు మండలం బొద్దవరం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బొద్దవరంలో వారు జననేతకు వినతి పత్రం అందజేశారు. వై.దొరబాబు మాట్లాడుతూ తాండవ నది ఒడ్డున ఉన్న పొలాల గట్లు కొన్నేళ్ల నుంచి ఇసుక మాఫియా అరాచకాలతో నాశనమయ్యాయన్నారు. మంచి నీటి కోసం వెళ్లే మహిళలకు భద్రతలేదన్నారు. ఓ సోదరి ఇసుక ఊబిలో కూరుకుపోయి చనిపోయినా పట్టించుకోని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. తాండవ నది అవతల వైపు ఉండడంతో నది పొంగిన సమయంలో రైతులు, పశువులకు భద్రత లేక ప్రాణాలు కోల్పోతున్నట్టు చెప్పారు. నది దాటేందుకు వంతెన, కమినీడు వారి కాలువ పునరుద్ధరణ, ప్రభుత్వ పాఠశాల ప్రహరీలు నిర్మించాలని జననేతను కోరారు.