ఈనాటి ముఖ్యాంశాలు
సాక్షి, హైదరాబాద్ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాళులర్పించారు. ఈ మేరకు ఆమె ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. భారీ వర్షాలతో ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రమంలో తాత్కాలికంగా సేవలను నిలిపివేశారు. విమానాల రాకపోకలకు వాతావరణం అనుకులంగా లేకపోవడంతో సేవలను కాసేపు ఆపేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్ మెజారిటీ కోల్పోయిందని, ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర చీఫ్ బీఎస్ యడ్యూరప్ప డిమాండ్ చేశారు. తెలంగాణలో త్వరలో జరుగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలు, మున్సిపల్ శాఖ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ భేటీలో రిజర్వేషన్లు, వార్డుల పునర్విభజన, ఓటర్ల తుది జాబితా వంటి అంశాలపై వారితో చర్చించారు.
మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..