ఈనాటి ముఖ్యాంశాలు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా శిశుమరణాల రేటు తగ్గుముఖం పడుతున్నట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ ఛౌబే మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. కర్ణాటక పరిణామాలపై పార్లమెంట్ హోరెత్తింది. పాలక జేడీఎస్-కాంగ్రెస్ సర్కార్ సంక్షోభంలో పడిన క్రమంలో ఆ రాష్ట్ర వ్యవహారాలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మంగళవారం లోక్సభలో నినదించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్పై ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో బ్రిటిష్ జనరల్ డయ్యర్ కన్న దారుణంగా వ్యవహరించారని అన్నారు. జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. విదేశాలకు వెళ్లేందుకు గోయల్ పెట్టుకున్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..