ఆయన బర్త్డే వేడుకలైతే కరోనా రాదా?
కుప్పంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు టీడీపీ వాళ్లు చేసింది ఏంటి? దాని వల్ల కరోనా రాదా? : సజ్జల రామకృష్ణా రెడ్డి
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి కారణంగా పెద్ద మానవ సంక్షోభమే సంభవించిదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ట్వీట్టర్ వేదికగా కరోనా విభృంజిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాకుండా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సైతం సేవ చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. (‘బాబు కరోనా రాజకీయాలు పక్కనపెట్టాలి’)
వైఎస్సార్సీపీ ఆ పని చేస్తుంటే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దుమ్మెత్తిపోస్తున్నారని సజ్జల ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులు ఇష్టమొచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారు, కరోనా లాంటి కష్టకాలంలో ఇలాంటి ఆరోపణలు తగవని హితవు పలికారు. కుప్పంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు టీడీపీ వాళ్లు చేసింది ఏంటి? దాని వల్ల కరోనా రాదా? అని సజ్జల రామకృష్ణారెడ్డి ట్వీట్టర్ వేదికగా ప్రశ్నించారు. (హెరిటేజ్ ఫ్యాక్టరీని క్లోజ్ చేశారా?..)
కరోనా వల్ల పెద్ద మానవ సంక్షోభమే వచ్చింది. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలే కాదు నాయకులూ, కార్యకర్తలూ, ప్రజలకు సేవచేయాలి. ఆ పని వైయస్సార్సీపీ చేస్తుంటే చంద్రబాబు రోజూ దుమ్మెత్తిపోస్తున్నాడు. మరి కుప్పంలో చంద్రబాబుగారి పుట్టినరోజు వేడుకులకు చేసింది ఏంటి? దీనివల్ల కరోనా వ్యాప్తి చెందదా? pic.twitter.com/v0j2YZrAOE
— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) April 29, 2020