డివైడర్ను ఢీకొన్న కర్నూలు-చెన్నై ఇంద్ర బస్సు


చెన్నై : చెన్నై సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి చెన్నై వెళుతున్న ఇంద్ర ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ మృతి చెందగా, ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top