ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం

RTC Bus Escapes Falling Into Well, One Killed - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, అనంతపురం : జిల్లాలోని మామిళ్లపల్లి కుంట క్రాస్‌ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన బస్సు ఫొటోను  గమనించండి. ఒక్క అడుగు దూరంలో మృత్యువు నుంచి బస్సులోని 30 మంది ప్రయాణీకులు తప్పించుకున్నారు. గోరంట్ల నుంచి పుట్టపర్తి బయల్దేరిన ఆర్టీసీ ఆర్డినరీ బస్సు మామిళ్లపల్లికి చేరుకుంది.

ఊరు దాటుతుండగా.. సడెన్‌గా బైక్‌ అడ్డురావడంతో డ్రైవర్‌ ఒక్కసారిగా బస్సును పక్కకు మరల్చారు. దీంతో రోడ్డుకు పక్కనే ఉన్న 30 అడుగుల లోతు గల బావి వైపు బస్సు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. బస్సులోని ప్రయాణీకులకు స్వల్పగాయాలు అయ్యాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top