నేడు శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు విడుదల
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లకు సంబంధించిన ఏప్రిల్ కోటాను గురువారం ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఈ మేరకు ఐటీ అధికారులు ఏర్పాట్లు చేశారు. తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా ముందు గానే దర్శన టికెట్లను రిజర్వు చేసుకోవాలని టీటీడీ పీఆర్వో రవి కోరారు.