తలనీలాల వేలం ద్వారా

Rs.2.38 crores revenue with haircut at TTD - Sakshi

రూ.2.38 కోట్ల ఆదాయం

తిరుపతి అర్బన్‌: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే తలనీలాలను గురువారం ఈ– వేలం ద్వారా విక్రయించారు. వీటి ద్వారా టీటీడీకి రూ.2.38 కోట్ల ఆదాయం వచ్చినట్లు మార్కెటింగ్‌ విభాగం అధికారులు తెలిపారు. ప్రతినెలా మొదటి గురువారం ఈ–వేలం ద్వారా తలనీలాలను విక్రయిస్తున్నారు. ఈసారి మొత్తం 3,500 కిలోలు తలనీలాలు అమ్ముడుపోయాయి. 5వ రకం, తెల్లవెంట్రుకలు పూర్తిగా అమ్ముడుకాలేదు. ఒకటో రకం కిలో రూ.22,494 చొప్పున 500 కిలోలు విక్రయించగా రూ.1.12 కోట్ల ఆదాయం వచ్చింది.

రెండో రకం కిలో రూ.17,223 చొప్పున 300 కిలోలు విక్రయించగా రూ.51.67 లక్షలు, మూడో రకం కిలో రూ.2,833 చొప్పున 2,400 కిలోలు విక్రయించగా రూ. 69.61 లక్షలు, నాలుగో రకం కిలో రూ.1,195 చొప్పున 300 కిలోలు విక్రయించగా రూ.4.41 లక్షలు ఆదాయం సమకూరిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top