శ్రీవారి ట్రస్టులకు రూ.1.28 కోట్ల విరాళం
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ట్రస్టుకు సోమవారం భక్తులు రూ.1.28 కోట్లను విరాళంగా ఇచ్చారు. ముంబైకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ప్రతినిధి శివశంకర్ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1.11 కోట్లు, ఇతర భక్తులు ఎస్వీ అన్నప్రసాదానికి రూ.15 లక్షలు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదినికి రూ.2 లక్షలు సమర్పించారు. తిరుమల జేఈవో కార్యాలయం సమీపంలోని ఆదిశేష విశ్రాంతి సముదాయంలో టీటీడీ అధికారులను భక్తులు కలసి ఈ మేరకు విరాళాలను అందజేశారు.