ఎగ్మోర్-కాచిగూడ ఎక్స్ప్రెస్ రైలులో దోపిడీ
కర్నూలు: చెన్నై ఎగ్మోర్-కాచిగూడ ఎక్స్ప్రెస్ రైలులో బుధవారం వేకువజామున 2 గంటలకు దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని డోన్ మండలం మల్యాల క్రాస్ వద్ద చోటుచేసుకుంది. నాలుగు బోగిల్లోకి ప్రవేశించిన దొంగలు సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోపిడీ అనంతరం దుండగులు ట్రైన్ చైన్లాగి పారిపోయినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు నిందితులకోసం గాలింపు చర్య మొదలు పెట్టారు.