నల్లమలలో రోడ్డు ప్రమాదం
కర్నూలు : కర్నూలు, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు శివ భక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం గుండె పల్లి గ్రామానికి చెందిన మధు, చంద్రప్పలు మూడు రోజుల కిందట తమ గ్రామం నుంచి మరో పది మందితో కలిసి శ్రీశైలం బయలుదేరారు. ద్విచక్ర వాహనంలో బయలుదేరిన వీరు శ్రీశైల మల్లేశుని దర్శన అనంతరం మహానందికి బయలుదేరారు. ప్రకాశం జిల్లా దోర్నాల పీఎస్ పరిధిలోని నల్లమల ఘాట్లో ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న గ్యాస్ సిలిండర్ లారీని, వారి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రప్ప, మధులు అక్కడికక్కడే మృతి చెందారు.