పట్టాలు మంజూరు కాలేదు..

Revenue Officials Delayed On Registration Lands - Sakshi

విజయనగరం :  పూర్వీకుల నుంచి సాగు చేస్తున్న భూములకు రెవెన్యూ అధికారులు పట్టాలు మంజూరు చేయడం లేదు.  మా సమస్యపై స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆయన అకాల మరణంతో నేటికీ మాకు భూమి పట్టాలు మంజూరు కాలేదు.– కొండతామర సురేష్, నరేష్, మెల్లక పూయు, రాజు, మెట్టవలస, బోరింగువలస గ్రామస్తులు

ఉద్యోగ భద్రత లేదు
ఆశ వర్కర్లకు నెలకు రూ.6 వేల గౌరవ వేతనం మంజూరు చేస్తామన్న ప్రభుత్వం నేటికి మూడు మాసాలు గడుస్తున్నా ఇవ్వడం లేదు. ఎంతో శ్రమపడి పనిచేస్తున్నా కనీస వేతనం, ఉద్యోగ భద్రత లేదు. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలోనూ మా సేవలు పొందుతున్నారు. కనీస వేతనాల కోసం పలుమార్లు ఆందోళనలు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. టీడీపీ పాలనలో అన్ని విధాల నష్టపోయాం. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ఆదుకుంటామని జగనన్న హామీ ఇచ్చారు.–  రౌతు వరలక్ష్మి, ఆశ వర్కర్, కోన, మక్కువ మండల

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top