రేపు శ్రీవారి సేవా స్లాట్ విడుదల
తిరుమల: ఈ ఏడాది అక్టోబర్ 10 నుంచి 18 వరకు జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమలకు విశేషంగా విచ్చేసే భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవా స్లాట్ను టీటీడీ గురువారం విడుదల చేయనుంది. అక్టోబర్ 9 నుంచి 15 వరకు, అక్టోబర్ 10 నుంచి 16 వరకు ఏడు రోజుల స్లాట్ అందుబాటులో ఉంటుంది. 18–60 ఏళ్లలోపు వారు ఈ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అక్టోబర్ 15 నుంచి 18 వరకు నాలుగు రోజుల స్లాట్, అక్టోబర్ 12 నుంచి 14 వరకు మూడు రోజుల స్లాట్ అందుబాటులో ఉంటాయి. 25–50 ఏళ్లలోపు వారు ఈ స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఐఆర్యూఎమ్ఏఎల్ఏ.ఓఆర్జీ వెబ్సైట్లో స్లాట్లను బుక్ చేసుకోవచ్చు.
అన్నదాన ట్రస్ట్కు రూ. కోటి విరాళం
టీటీడీ ఎస్వీ అన్నదాన ట్రస్ట్కు హైదరాబాద్కు చెందిన మీనాక్షీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ అధినేత శ్రీనివాసులు కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం డిప్యూటీ ఈవో రవికి చెక్ను అందజేశారు. మరోవైపు సర్వేశ్రేయ ట్రస్ట్కు మంగళవారం రూ.10 లక్షల విరాళం అందింది.