రేషన్కార్డు మంజూరు కావడంలేదన్నా..
తూర్పుగోదావరి :పెళ్లై సుమారు పది సంవత్సరాలు కావస్తున్నా నేటికీ తమకు రేషన్కార్డు మంజూరు చేయలేదని తాటిపాకకు చెందిన మందపాటి నాగసత్యవతి జగన్కు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సార్లు జన్మభూమి కార్యక్రమంలో రేషన్కార్డు కోసం దరఖాస్తు చేసినా ఫలితం లేకపోయిందని వాపోయారు.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తమకు రేషన్కార్డు మంజూరు చేయాలని కోరారు.